తొట్టంబేడులో రేపు ఎమ్మెల్యే గ్రీవెన్స్

54చూసినవారు
తొట్టంబేడులో రేపు ఎమ్మెల్యే గ్రీవెన్స్
శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండల ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన కార్యాలయం ఆదివారం తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఎమ్మెల్యే ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్