సాయినగర్ సర్పంచ్ డి. వి. రమణకు మాతృ వియోగం
తిరుపతి రూరల్ మండలం సాయి నగర్ పంచాయతీ సర్పంచ్ బి. వి రమణకు మాతృవియోగం కలిగింది. గురువారం వేకువజామున డి. గంగులమ్మ(83) ఆకస్మికంగా మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆమె పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సర్పంచ్ డి. వి. రమణను కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.