మహిళా నిర్మాతలపై పోక్సో చట్టం కింద కేసు నమోదు

68చూసినవారు
మహిళా నిర్మాతలపై పోక్సో చట్టం కింద కేసు నమోదు
సీరియల్స్, వెబ్ సిరీస్‌లు నిర్మించే "బాలాజీ టెలీఫిలిమ్స్' నిర్మాత ఏక్తా కపూర్‌తో పాటు ఆమె తల్లి శోభా కపూర్‌పై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆల్ట్‌ బాలాజీ సంస్థ నిర్మాణంలో వచ్చిన ‘గంధీభాత్‌’ వెబ్‌ సిరీస్‌‌లోని ఓ ఎపిసోడ్‌లో మైనర్‌ బాలికలను అశ్లీలంగా చూపించారంటూ ఆరోపిస్తూ.. ముంబయి బోరివాలిలోని ఎంహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్