పింఛన్‌దారులకు సీఎం చంద్రబాబు లేఖ

58చూసినవారు
పింఛన్‌దారులకు సీఎం చంద్రబాబు లేఖ
AP: రాష్ట్రంలోని పింఛన్‌దారులకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. "మీకు అండగా నిలుస్తూ, సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది. ఏ ఆశలు, ఆకాంక్షలతో గెలిపించారో.. వాటిని నెరవేర్చడమే తక్షణ కర్తవ్యం. మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్‌ను ఒకేసారి రూ.1000 పెంచి ఇస్తున్నాం. దివ్యాంగులకు పింఛన్‌ రూ.6 వేలు ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. జులై 1నుంచే పెంచిన పింఛన్లు ఇంటి వద్దే అందించనున్నాం." అని సీఎం పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్