నేడు సీఎం వైఎస్ జగన్ మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కొండెపి నియోజకవర్గం టంగుటూరులో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు కడప పార్లమెంట్ పరిధిలోని మైదుకూరు 4 రోడ్ల జంక్షనులో జరిగే సభలో పాల్గొంటారు. ఆ తరువాత మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పీలేరు నియోజకవర్గం కలికిరిలో జరిగే ప్రచార సభలో జగన్ పాల్గొంటారు.