పెనుమాకలో పింఛన్లు పంపిణీ చేయనున్న సీఎం

69చూసినవారు
పెనుమాకలో పింఛన్లు పంపిణీ చేయనున్న సీఎం
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పెనుమాక గ్రామంలో సోమవారం ఉదయం 6 గంటలకు ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారు. ఇద్దరు పింఛను లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి రూ.7వేల నగదును ముఖ్యమంత్రే అందజేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జరిగే ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో ఎన్డీయే కూటమి పార్టీల ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్