కాలుష్యంపై ఫిర్యాదు చేయండి: పవన్ కళ్యాణ్

82చూసినవారు
కాలుష్యంపై ఫిర్యాదు చేయండి: పవన్ కళ్యాణ్
ఏపీ ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. ‘మీ పరిసరాలలో కాలుష్య సమస్య ఉంటే.. ఇవాళ మధ్యాహ్నం 3-5 గంటలలోపు మీ ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) కార్యాలయంలో ఫిర్యాదు చేయండి. వాటిని పరిష్కరించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. త్వరలో కాలుష్య నివారణపై పర్యావరణ నిపుణులు, సంబంధిత ఎన్జీవోలు, పీసీబీ అధికారులందరితో సమావేశం నిర్వహిస్తాం.’ అని పవన్ శనివారం ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్