బాలకృష్ణ, పవన్‌పై ఈసీకి ఫిర్యాదు

80918చూసినవారు
బాలకృష్ణ, పవన్‌పై ఈసీకి ఫిర్యాదు
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడంతో పాటు సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు ఎలక్షన్ కమిషన్‌ (ఈసీ)కి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సచివాలయంలో సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను కలిసి ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఆధారాలతో ఫిర్యాదు అందజేశారు. కదిరి బహిరంగ సభలో బాలకృష్ణ, తెనాలి సభలో పవన్ ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా చేసి వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్