టీటీడీ ఈవో ధర్మారెడ్డిని తొలగించాలని కోరుతూ ఏపీ సీఈవో ముకేశ్కుమార్ మీనాకు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. తిరుమల-తిరుపతిలో రాజకీయ ప్రచారం, అక్రమాలను గురించి తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కూటమి నేతలు మాట్లాడుతూ.. ధర్మారెడ్డి వల్ల టీటీడీ గౌరవ ప్రతిష్ఠలు దెబ్బతిన్నాయని విమర్శించారు. టీటీడీకి చెందిన రూ.5 వేల కోట్ల నిధులను దారి మళ్లించారని ఆరోపించారు.