పరిహారం అందలేదని వరద బాధితుల ఆవేదన

61చూసినవారు
విజయవాడ వరద బాధితులు తమకు న్యాయం చేయాలంటూ కొందరు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ముందు వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లు నిండా మునిగిపోయి నష్టపోయామని, ప్రభుత్వం తమకూ నష్టపరిహారం అందేలా చూడాలని వేడుకున్నారు. అయితే బ్యాంకు ఖాతా వివరాలు సరిగా లేని వారికి మాత్రమే నగదు జమ కాలేదని, త్వరలోనే వారికి కూడా పరిహారం అందిస్తామని కలెక్టర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్