AP: రాష్ట్ర సీఎస్ జవహర్రెడ్డి సెలవు పెట్టి వెళ్లారు. ఇవాళ సాయంత్రంలోగా కొత్త సీఎస్ను నియమించే అవకాశం ఉంది. వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొన్న జవహర్రెడ్డిని కొత్త ప్రభుత్వం పక్కన పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు అనారోగ్య కారణాలతో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ కూడా సెలవు పెట్టి వెళ్లారు.