రేపు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న పవన్ కళ్యాణ్ ఛాంబర్ను మార్చారు. తొలుత సచివాలయంలోని 212,214 రూమ్లను కేటాయించగా ఆ గదులు తనకు కావాలని మంత్రి పయ్యావుల కేశవ్ అడిగినట్ల సమాచారం. దీంతో పవన్ కోసం 211 రూమ్ను సిద్ధం చేశారు. కాసేపట్లో ఆయన ఛాంబర్ను పరిశీలించనున్నారు. రేపు ఇక్కడే పవన్ బాధ్యతలు చేపట్టనున్నారు.