ఏపీలో డయేరియా విజృంభణ.. నలుగురు మృతి

85చూసినవారు
ఏపీలో డయేరియా విజృంభణ.. నలుగురు మృతి
ఏపీలోని పిడుగురాళ్లలో డయేరియా విజృంభిస్తోంది. నీటి కాలుష్యం వల్ల సుమారు 200 మంది డయేరియా బారిన పడ్డారు. నలుగురు మృతి చెందారు. పిడుగురాళ్ల లెనిన్ నగర్, మారుతీనగర్‌లో నిన్న ఒక్కరోజే 20 మంది డయేరియా బారిన పడ్డారు. వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. దాంతో వైద్య సిబ్బంది అప్రమత్తమైంది. చికిత్స అందిస్తూనే.. అవగాహన కార్యక్రమం చేపట్టింది.

సంబంధిత పోస్ట్