విజయవాడలో మంగళవారం కూటమి శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో
బీజేపీ చీఫ్ పురందేశ్వరి పాల్గొని మాట్లాడారు. ‘గత ఐదేళ్లలో కక్షపూరిత పాలనను ఎదుర్కొన్నాం. ఐదేళ్లలో అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుండా పోయింది. ప్రజలు సంక్షేమానికి దూరమయ్యారు. కూటమి అధికారంలోకి వస్తుందనే భావన అందరిలో ఉంది. ప్రజావ్యతిరేక పాలనను అంతమొందించాలని ప్రజలు నిర్ణయించారు.’ అని పురందేశ్వరి చెప్పారు.