తెలుగురాష్ట్రాల్లో విజృంభిస్తున్న హెపటైటిస్

71చూసినవారు
తెలుగురాష్ట్రాల్లో విజృంభిస్తున్న హెపటైటిస్
తెలుగు రాష్ట్రాల్లో చాపకింద నీరులా హెపటైటిస్‌ విస్తరిస్తోంది. తీవ్రమైన కాలేయ వ్యాధికి ఇది కారణమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు, కోనసీమ, విశాఖ జిల్లాల్లో ఈ కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. ఏపీలో ఒక్క ఫిబ్రవరి నెల రెండో వారంలోనే 266 హెపటైటిస్‌ కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణలో ఈ వైద్య పరీక్షలు చేసిన దాదాపు ప్రతి 235 మందిలో ఒకరికి ఉన్నట్లుగా గుర్తించారు.

సంబంధిత పోస్ట్