పింఛన్ల పంపిణీ.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు

81చూసినవారు
పింఛన్ల పంపిణీ.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు
ఎన్టీఆర్ భరోసా కింద ప్రజలకు అందించే పింఛన్ల పంపిణీలో భాగమయ్యే ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 15 వరకు ఉద్యోగ బదిలీలు ఉండవని ఆదేశాలు జారీ చేసింది. మిగతా ప్రభుత్వ శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్ 1 నుంచి బదిలీలు చేపడతామని వెల్లడించింది. పింఛన్ల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

సంబంధిత పోస్ట్