సీఎం జగన్ పుణ్యమా అని క్రైమ్ ఇన్వాల్వ్మెంట్ డిపార్ట్మెంట్గా CID మారిపోయిందని నారా లోకేశ్ విమర్శించారు. "మా కుటుంబంపై బురద చల్లేందుకు భారీ కుట్ర జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా సీఐడీ డీఐజీ రఘురామిరెడ్డి మా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు పత్రాలు దహనం చేశారు. పత్రాలు తగులబెడితే పాపాలు పోతాయా?" అని పేర్కొంటూ ట్విట్టర్లో ఒక వీడియోను లోకేశ్ షేర్ చేశారు.