నిన్న గుజరాత్తో మ్యాచ్లో లక్నో 33 పరుగుల తేడాతో గెలిచింది. గుజరాత్ పతనంలో కీలక పాత్ర పోషించిన యువ బౌలర్ యశ్ ఠాకూర్(5/30) ప్రత్యర్థి జట్టును చావుదెబ్బ కొట్టాడు. ఈ క్రమంలో ఈ ఐపీఎల్లో అరుదైన ఘనతను తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి (15వ ఓవర్) మెయిడిన్ చేసిన బౌలర్గా అవతరించాడు. దీంతోపాటు ఈ సీజన్లో తొలి ఫైఫర్ (5 వికెట్లు) తీసిన బౌలర్గానూ నిలిచాడు.