AP: విశాఖ స్టేడియం పేరు మార్పు వివాదంపై వైసీపీకి ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. క్రీడలను రాజకీయాలతో ముడి పెట్టొద్దన్నారు. స్టేడియానికి 30 ఏళ్లుగా ఉన్న పేరే ఉందని, తాము ఏ పేరు మార్చలేదని స్పష్టం చేశారు. రాజకీయం చేయడం కోసమే వైసీపీ ఇదంతా చేస్తోందని విమర్శించారు. వైసీపీ నేతలు ఎందుకు ఆందోళన చేస్తున్నారో వారికే తెలియాలన్నారు. విశాఖ బ్రాండ్ను దెబ్బతీస్తున్నారన్నారు.