ఇంట్లో నిద్రిస్తుండగా దంపతులపై శ్లాబ్ పెచ్చులు

66చూసినవారు
ఇంట్లో నిద్రిస్తుండగా దంపతులపై శ్లాబ్ పెచ్చులు
నిడదవోలు పట్టణ పరిధిలోని 23వ వార్డు లింగంపల్లిలో బుధవారం తెల్లవారుజామున ఓ ఇంటి శ్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. ప్రమాద సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న బల్ల పుల్లయ్య-లక్ష్మమ్మ దంపతులపై పెచ్చులు పడ్డాయి. దీంతో వారికి గాయాలు కావడంతో వైద్యసేవల నిమిత్తం నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు నిడదవోలు టీడీపీ పట్టణాధ్యక్షుడు వెంకటేశ్వరరావు పరామర్శించారు.

సంబంధిత పోస్ట్