ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి, నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నియోజకవర్గంలోని పలు విషయాలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు.