
పెరవలి: కోళ్ల మృత్యువాతతో ఆందోళన చెందవద్దు
పెరవలి మండలం కానూరు అగ్రహారంలో 50 వేల కోళ్లు మృత్యువాత పడ్డాయని ఘటనపై నిడదవోలు మంత్రి కందుల దుర్గేష్ సోమవారం స్పందించారు. ఈ అంశంపై కలెక్టర్ ప్రశాంతి, స్థానిక ఎంపీడీవో సి.హెచ్ వెంకట రమణ, తహశీల్దార్ అచ్యుత కుమారితో చర్చించానన్నారు. ప్రజలెవరూ భయాందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదని కొద్ది రోజులు చికెన్ ఆహర పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.