అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత

65చూసినవారు
అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత
పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా ఆదివారం గండేపల్లి మండలం జెడ్. రాగంపేటలో సివిల్ సప్లై అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. జగ్గంపేట ఎమ్ఎస్ఓ కృష్ణ మాట్లాడుతూ గోనేడ గ్రామం నుంచి రాజానగరం వైపు తరలిస్తుండగా తమకు వచ్చిన రహస్యం సమాచారంతో దాడిచేసి పట్టుకున్నామన్నారు. రూ. 1, 74, 780 విలువ చేసే 38 క్వింటాళ్ల 84 కేజీల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్