గోకవరంలో రైతుల ఆందోళన

85చూసినవారు
తూర్పుగోదావరి జిల్లా గోకవరం సబ్ స్టేషన్ వద్ద మండల రైతులు ఆందోళన నిర్వహించారు. గురువారం ఉదయం గోకవరం సబ్ స్టేషన్ ను ముట్టడించి తొమ్మిదిగంటల కరెంటు అందిస్తామని 7 గంటలు మాత్రమే ఇస్తున్నారని దానివల్ల పంటలు ఎండిపోయి తీవ్రనష్టం వాటిల్లుతుందని ఇదేకొనసాగితే ఆత్మహత్య తప్ప వేరే శరణ్యం లేదని వాపోయారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి ఉంగరాల రాము రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు అడపా భరత్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్