ఎన్నికలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన గోకవరం ఎస్సై

67చూసినవారు
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గాదెలపాలెం గ్రామంలో గోకవరం ఎస్సై కె. నాగరాజు ఆధ్వర్యంలో ఎన్నికలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఎన్నికలు జరగడానికి దోహదపడాలని కోరారు. గ్రామంలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో గళ్ళ రామకృష్ణ, గల్లా రాము, శివాజీ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్