ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం

67చూసినవారు
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం
ప్రజా సమస్యల పరిష్కారంకై ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం కాకినాడలోని కలెక్టరేట్ లో సోమవారం జరగనుందని కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదివారం తెలిపారు. గడిచిన రెండు వారాల పాటు జిల్లాలో సంభవించిన వరదల వల్ల ఈ కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని చెప్పారు. ఇక నుంచి ప్రతి సోమవారం ఈ కార్యక్రమం యథావిధిగా జరగనున్నట్లు వివరించారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగించుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్