వాడపల్లి వెంకన్నను దర్శించుకున్న జడ్జి మల్లికార్జునరావు

67చూసినవారు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జ్ టి. మల్లికార్జునరావు దంపతులు ఆదివారం స్వామివారిని దర్శించు కున్నారు. జడ్జి దంపతులకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్