రౌడీ రాజ్యానికి చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉందని ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అన్నారు. రాయవరం మండలం, చెల్లూరులో బాబు ష్యూరిటీ, భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో సోమవారం టీడీపీ, జనసేన నాయకులతో ఆయన ఇంటింటికీ పర్యటించారు. మే 13వ తేదీన ప్రభుత్వాన్ని మార్చే అవకాశం ఓటర్ల చేతికి రానున్నదని, తమ విలువైన ఓటును టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి వేసి వైకాపాను చిత్తుచిత్తుగా ఓడించాలని విజ్ఞప్తి చేశారు.