మండపేట రథం గుడిలో వేంచేసి ఉన్న శ్రీ అగస్త్యేశ్వర, కైలాసశ్వర, సర్వేశ్వర స్వామి వార్ల దివ్య కళ్యాణ మహోత్సవం శుక్రవారం ఉదయం 5 గంటలకు వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు అయినవిల్లి సూర్య సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.