మండపేట నియోజకవర్గం రాయవరం ఆర్బికేలో వ్యవసాయ, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలుపై మండల వ్యవసాయ అధికారి కే ప్రభాకర్ ఆధ్వర్యంలో మండల స్థాయి శిక్షణ కార్యక్రమం జరిగింది. గ్రామ వ్యవసాయ సహాయకులు, గ్రామ రెవెన్యూ అధికారులు, ప్రాథమిక వ్యవసాయ సొసైటీ సెక్రటరీలకు దాల్వ పంట, ధాన్యం కొనుగోలుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ మండలంలో 14,447 ఎకరాలలో వరి సాగు చేయడం జరిగిందన్నారు.