ఐ. పోలవరం: 24 గంటల పాటు ఏకధాటిగా అహోరాత్ర పారాయణం

84చూసినవారు
ఐ. పోలవరం మండలం మురమళ్ల వీరేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా అహోరాత్ర పారాయణం మంగళవారం ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా మహిళలు ఆలపించిన లలిత సహస్రనామ పారాయణం భక్తులను విశేషంగా అలరించింది. ఉదయం కలశ స్థాపనతో ప్రారంభమైన పారాయణం నిరంతరాయంగా 24 గంటలపాటు జరుగుతుందని ఆలయ సహాయ కమిషనర్ మాచిరాజు లక్ష్మీనారాయణ తెలిపారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్