ఐ. పోలవరం: విజయదుర్గ అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి

59చూసినవారు
ఐ. పోలవరం మండలం ఎదుర్లంక రామాలయం పేటలో కొలువై ఉన్న శ్రీవిజయదుర్గ అమ్మవారి ఆలయాన్ని రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాశ్ మంగళవారం సందర్శించి, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు సుభాశు ఘనంగా స్వాగతం పలికారు. పూజలు అనంతరం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్