రేపటి నుంచి వల్లి బాబా ఉరుసు ఉత్సవాలు

55చూసినవారు
రేపటి నుంచి వల్లి బాబా ఉరుసు ఉత్సవాలు
ముమ్మిడివరం మండలం కొత్తలంక వల్లి బాబా 77వ ఉరుసు ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభంకానున్నాయి. రేపటి నుంచి మూడు రోజులపాటు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దర్గా కమిటీ శనివారం తెలిపింది. భక్తులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించారు. బాబా దర్గాను రంగురంగుల దీపాలతో అలంకరించి పందిళ్లు వేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలిరానున్నారు.

సంబంధిత పోస్ట్