ఉప్పాడ మత్స్యకారులకు చిక్కిన భారీ టేకు చేప

61చూసినవారు
ఉప్పాడ మత్స్యకారులకు చిక్కిన భారీ టేకు చేప
కొత్తపల్లి మండలం ఉప్పాడ చేపల రేవులో సముద్రంపై వేటకు వెళ్లిన మత్స్యకారులకు భారీ టేకుచేప చిక్కింది. గురువారం పడవపై దీనిని ఒడ్డుకు తీసుకొచ్చి వేలం నిర్వహించగా ఓ వ్యాపారి కొనుగోలు చేశాడు. ఇలాంటి టేకు చేపలు చిన్నగా ఉంటే తినడానికి ఉపయోగిస్తారని, భారీగా పెరిగితే వివిధ రకాల ఔషధాల తయారీకి వినియోగిస్తారని మత్స్యశాఖ అభివృద్ధి అధికారి శివరామకృష్ణ తెలియజేశారు. భారీ టేకు చేపను పలువురు ఆశక్తిగా తిలకిస్తున్నారు.

సంబంధిత పోస్ట్