మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి

75చూసినవారు
రాజమండ్రి నగరపాలక సంస్థ అధికారులు నగరంలోని అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కమిషనర్ కేతన్ గార్గ్ సూచించారు. ప్రజా సమస్యలపై సోమవారం రాజమండ్రి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి 41 అర్జీలు వచ్చాయని తెలిపారు. అర్జీలలోని అంశాలను పరిశీలించి ప్రజల సమస్యలకు సకాలంలో పరిష్కారం చూపుతామని వివరించారు.

సంబంధిత పోస్ట్