రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా భారతీయ చైతన్య పార్టీ నుంచి వెలిగట్ల సుబ్రహ్మణ్యం గురువారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా రాజమండ్రి నగర పాలక సంస్థ కార్యాలయంలో పుర కమిషనర్, ఆర్వో దినేష్ కుమార్కు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పార్టీ నాయకులు, అభిమానులు తదితరులు ఉన్నారు.