అక్రమంగా విక్రయిస్తున్న తెలంగాణ మద్యాన్ని ధవళేశ్వరం పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. సీఐ జీవీ వినయ్ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం స్థానిక రామపాదాల రేవు వద్ద నివాసం ఉంటున్న ఏలూరి సత్యనారాయణ తెలంగాణ మద్యాన్ని అమ్ముతున్నాడన్న సమాచారంతో దాడి చేశామన్నారు. ఈ దాడిలో అతడిని అదుపులోకి తీసుకొని పది సీసాలు, రూ. 900 నగదు స్వాధీనం చేసుకొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.