ఎన్నికల నిర్వహణలో భాగంగా అన్ని విభాగాలు అప్రమత్తంగా, పారదర్శకంగా, జవాబుదారీతనంతో వ్యవహరించేలా చర్యలు తీసుకున్నామని తూ. గో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె. మాధవీలత తెలిపారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టర్ వద్ద ఆమె మాట్లాడుతూ ప్రధానంగా అనుమతులు, అక్రమ సొత్తు స్వాధీనం, సీ–విజిల్ కార్యకలాపాలపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. నిఘా వ్యవస్థను కట్టుదిట్టం చేశామని తెలిపారు.