గండి పోచమ్మ ఆలయాన్ని తాకిన వరద గోదావరి

63చూసినవారు
దేవీపట్నం మండలం గండి పోచమ్మ ఆలయానికి వరద గోదారి తాకింది గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెరిగిన గోదావరి ఉదృతి తోఆదివారం అమ్మవారి దేవస్థానం మండపం సమీపానికి వరద నీరు చేరుకుంది.మరోపక్క ఆదివారం కావడంతో అమ్మవారి దర్శనానికి భారీగా భక్తులు పోటెత్తారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనలతో పాపికొండల విహారయాత్ర అధికారులు నిలిపివేశారు.

సంబంధిత పోస్ట్