గోదావరిలో వినాయకుడి విగ్రహాలు.. భక్తులకు ఇబ్బందులు

69చూసినవారు
గణపతి నవరాత్రుల సందర్భంగా వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహాలను ఘనంగా ఊరేగిస్తూ రాజోలు వశిష్ట గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. నిమజ్జనం చేసిన విగ్రహాలు గోదావరిలో అదేవిధంగా ఉండిపోయాయని భక్తులు ఆదివారం చెప్పారు. ఆ విగ్రహాల వల్ల నదిలో స్నానం ఆచరించేందుకు ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. గోదావరిలో స్నానం చేసే భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్