అధ్యాపకుల దీక్షకు ఎమ్మెల్సీ సంఘీభావం

55చూసినవారు
అధ్యాపకుల దీక్షకు ఎమ్మెల్సీ సంఘీభావం
మలికిపురం డిగ్రీ కళాశాల అధ్యాపకులు చేస్తున్న నిరసన దీక్షలు శుక్రవారం 24వ రోజుకు చేరాయి. జీతాలు చెల్లించక రోడ్డున పడిన తమ కుటుంబాలను ఆదుకోవాలని యాజమాన్యాన్ని కోరుతూ అధ్యాపకులు దీక్ష కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అధ్యాపకుల శిబిరాన్ని సందర్శించి, దీక్ష చేస్తున్న వారికి సంఘీభావాన్ని తెలిపారు. డిమాండ్లు వెంటనే పరిష్కరించాలన్నారు. నల్లి శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్