గూడాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
అల్లవరం మండలం గూడాలలోని అరుంధతిపేటలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు బొమ్మి ఇజ్రాయిల్ శుక్రవారం రాత్రి స్థానిక నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ వైసీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.