May 20, 2024, 16:05 IST/జడ్చర్ల నియోజకవర్గం
జడ్చర్ల నియోజకవర్గం
ముళ్ల పొదల్లో కుళ్ళిన మృతదేహం
May 20, 2024, 16:05 IST
మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా బొంరాస్ పేట మండలం నాందార్ పూర్ గ్రామ శివారులోని అనంతపూర్ గేటు సమీపంలో బ్రిడ్జి దగ్గర గుర్తు తెలియని వ్యక్తి శవం ముళ్ల పొదల లభ్యమయింది. సోమవారం సాయంత్రం వర్షం కురవడంతో కుళ్లిన శవం వాసనను గుర్తించిన పలువురు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. శవంతో పాటు పక్కనే ద్విచక్ర వాహనం ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.