May 12, 2024, 08:05 IST/జడ్చర్ల నియోజకవర్గం
జడ్చర్ల నియోజకవర్గం
నేడు కొడంగల్ కు సీఎం దంపతులు
May 12, 2024, 08:05 IST
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సతీసమేతంగా ఆదివారం కొడంగల్ కు వెళ్లనున్నట్లు సమాచారం. ఇవాళ, రేపు 2 రోజుల పాటు ఆయన కొడంగల్ లోనే ఉంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా సోమవారం మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు కొడంగల్ రానున్నారు. ఈ క్రమంలోనే సతీసమేతంగా సీఎం దంపతులు కొడంగల్ వెళ్లేందుకు సిద్ధమయ్యారని సమాచారం.