తాగునీరు అందక ప్రజలు ఇక్కట్లు

1105చూసినవారు
తాగునీరు అందక ప్రజలు ఇక్కట్లు
ఉప్పలగుప్తం మండలంలోని చల్లపల్లి లక్ష్మీ గణపతి వీధిలో తాగునీరు అందక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 2 సంవత్సరాల నుంచి కుళాయిలు పనిచేయడం లేదని ఆదివారం తెలిపారు. మూడు కిలోమీటర్ల నుంచి నీరు తెచ్చుకుంటున్నామని, ఎన్నోమార్లు పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్