ఏపీలో ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ (ఈసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఉద్యోగులకు నిర్వహిస్తున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో సమస్య ఎదురైంది. ఇక్కడ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పోస్టల్ బ్యాలెట్ స్థానంలో ఈవీఎం బ్యాలెట్ పేపర్లను ఇచ్చారు. ఉద్యోగులు సైతం వాటిపైనే ఓట్లు వేశారు. చివర్లో విషయం తెలియడంలో విపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేయడంతో రీపోలింగ్కు ఆదేశాలిచ్చింది. మరో రెండ్రోజుల్లో అక్కడ రీపోలింగ్ జరగనుంది.