ఏపీలో ఎన్నికల వేళ వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. విజయవాడకు చెందిన రెల్లి కుల సంఘం నాయకుడు, వైసీపీ నేత వరకృష్ణ బీజేపీలో చేరారు. సుజనా చౌదరి సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు మాజీ కేంద్ర మంత్రి సయ్యద్ షాన్ వాజ్ హుస్సేన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీలో గుర్తింపు లేదని వరకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.