గోపాలపురం: రోడ్డు ప్రమాదంలో భవానీ భక్తుడు మృతి

73చూసినవారు
గోపాలపురం: రోడ్డు ప్రమాదంలో భవానీ భక్తుడు మృతి
దేవరపల్లి మండలం యర్నగూడెం జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట మండలం గుండేపల్లికి చెందిన యశ్వంత్, స్నేహితుడితో కలిసి భవాని దీక్ష విరమించి విజయవాడ నుంచి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో యర్నగూడెం వద్ద వారి బైకు అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది. ఈ ఘటనలో యశ్వంత్ (30) మృతి చెందగా. మరొకరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్