మంగళవారం వెలువడిన ఎన్నికల ఫలితాలలో హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో ఎప్పుడు లేని విధంగా బీజేపీ వరుసగా మూడవసారి ఘనవిజయాన్ని కైవసం చేసుకొని బిజెపి చరిత్ర సృష్టించిందని కిసాన్ మోర్చా ఏలూరు జిల్లా అధ్యక్షులు కీర్తి రామ్ ప్రసాద్ అన్నారు. కైకలూరు లో మంగళవారం అయన మాట్లాడుతూ హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో వరుసగా మూడోసారి ఇంతవరకు ఏ పార్టీ గెలవలేదఎన్నారు. కానీ నేడు బిజెపి మూడవ సారి నెగ్గి చరిత్ర సృష్టించిందన్నారు.