రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మంగళవారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని సమస్యలను విపులంగా మంత్రికి వివరించి పరిష్కరించాలని కోరారు. దీనిపై మంత్రి నిమ్మల సానుకూలంగా స్పందించారు. ప్రాధాన్యతా క్రమంలో సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.